కేజీ నుంచి పీజీ విద్యావిధానానికి చుక్కానిగా.. తెలంగాణ గురుకుల విద్యాలయాల పయనం
ఈనాడు - హైదరాబాద్

‘‘మనం ఎవరికీ తీసిపోం...ఏదైనా సాధించాలనే తపన...అవకాశాల అన్వేషణ...కఠోరమైన సాధన... ఉక్కులాంటి క్రమశిక్షణతో ఆకాశమే హద్దుగా అద్భుతాలను ఆవిష్కరిద్దాం..’’ తెలంగాణలోని దళిత, గిరిజన గురుకుల విద్యాలయాల్లో గోడలపై కనిపించే నినాదమిది. లక్షల మంది పేద విద్యార్థులలో ఇలాంటి నినాదాలు స్ఫూర్తిని నింపుతున్నాయి. సాదాసీదా విద్యార్థులను అసాధారణ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలపై మోజుతో సర్కారు విద్యాసంస్థలపై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో తెలంగాణలో ప్రభుత్వం, అధికారులు, అధ్యాపక బృందం వినూత్న పంథాతో వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన కేజీ నుంచి పీజీ విద్యావిధానానికి చుక్కానిగా ఈ సంస్థలు నిలుస్తున్నాయి. దేశానికే ఆదర్శంగా మారడంతో అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చి ఇక్కడ విధానాలను అధ్యయనం చేస్తున్నాయి.
‘‘తెలంగాణలోని గురుకులాలను చూస్తే నలందా విద్యాలయాలు గుర్తుకొస్తున్నాయి. విద్యార్థులను ఇక్కడ తీర్చిదిద్దేవిధానం అద్భుతం....వీరంతా దేశం గర్వించేలా ఉత్తమ పౌరులుగా ఎదగడం ఖాయం..’’ మేఘాలయ సీనియర్ ఐఏఎస్ అధికారుల వ్యాఖ్యలివి.

ఐపీఎస్ చదివి.. గురుకులాల బాధ్యత
మహబూబ్నగర్ జిల్లా మన్ననూరుకు చెందిన ప్రవీణ్కుమార్ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువుకున్నారు. ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్(1995 బ్యాచ్) అధికారి అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, అనంతపురం, హైదరాబాద్ జిల్లాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. హార్వర్డ్ విశ్వవిధ్యాలయంలో ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే చోటే పనిచేయాలంటూ ‘మా వూరికి రండి’ అని సామాజిక ఉద్యమాన్ని చేపట్టి ప్రశంసలు పొందారు. వసతిగృహంలో చదువుకున్నప్పటి నుంచే ఆయనలో వాటిని బాగుచేయాలని, విద్యార్థులకు మేలు చేయాలనే భావన ఉండేది. తన ఆశలు, ఆలోచనలను ప్రభుత్వానికి వివరించి గురుకులాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. సామాజికాంశాల అభివృద్ధికి ముందుకు రావడం అరుదైన అంశంగా భావించి ప్రభుత్వం ఆయనను గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా నియమించింది. నాలుగేళ్లుగా ప్రవీణ్కుమార్ ఈ వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికారు. తెలంగాణలోని ప్రతీగురుకులాన్ని సందర్శించి, ప్రతీ విద్యార్థిని కలిసిన ఘనత ఆయనది.
మహబూబ్నగర్ జిల్లా మన్ననూరుకు చెందిన ప్రవీణ్కుమార్ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండి చదువుకున్నారు. ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్(1995 బ్యాచ్) అధికారి అయ్యారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, అనంతపురం, హైదరాబాద్ జిల్లాల్లో పనిచేసి తనదైన ముద్ర వేశారు. హార్వర్డ్ విశ్వవిధ్యాలయంలో ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే చోటే పనిచేయాలంటూ ‘మా వూరికి రండి’ అని సామాజిక ఉద్యమాన్ని చేపట్టి ప్రశంసలు పొందారు. వసతిగృహంలో చదువుకున్నప్పటి నుంచే ఆయనలో వాటిని బాగుచేయాలని, విద్యార్థులకు మేలు చేయాలనే భావన ఉండేది. తన ఆశలు, ఆలోచనలను ప్రభుత్వానికి వివరించి గురుకులాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. సామాజికాంశాల అభివృద్ధికి ముందుకు రావడం అరుదైన అంశంగా భావించి ప్రభుత్వం ఆయనను గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా నియమించింది. నాలుగేళ్లుగా ప్రవీణ్కుమార్ ఈ వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికారు. తెలంగాణలోని ప్రతీగురుకులాన్ని సందర్శించి, ప్రతీ విద్యార్థిని కలిసిన ఘనత ఆయనది.

గురుకులాల్లో రాయడం, చదవడం వచ్చిన అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి ప్రవేశాలుంటాయి. చేరిన తర్వాత వారి కుటుంబ పూర్వాపరాలను, వారి మనోభావాలను తెలుసుకుంటారు. జీవితమంటే ఒక్క చదువే కాదని, అనేక పార్శాలున్నాయని వివరిస్తారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సంకల్ప దీక్షతో ముందుకు సాగాలని ఉద్బోధిస్తారు. విద్యార్థులకు సరళంగా బోధనను అందించేందుకు వీలుగా దేశ, విదేశాల్లోని ప్రముఖ బోధన నిపుణులతో గురుకులాల్లోని అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించారు.
ఒత్తిడి లేని..ప్రమాణాలతో కూడిన విద్య
ఇక్కడ విద్యలో ఒత్తిడికి స్థానం లేదు. ప్రమాణాల పెంపుదలతోపాటు విషయ పరిజ్ఞానం, అభ్యాసం, ప్రయోగ జ్ఞానం పెంచుతున్నారు. మెడిసిన్, ఐఐటీ, ఇంజినీరింగు తదితర కోర్సులపై ఆసక్తి చూపే వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించారు. పదోతరగతి, ఇంటర్లలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగులోనూ రాణిస్తున్నారు. బెంగళూరులోని అజీం ప్రేమ్జీ విశ్యవిద్యాలయానికి 22 మంది విద్యార్థులు ఎంపికై రికార్డు సాధించారు. ప్రాథమిక స్థాయి నుంచే సివిల్స్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన టీవీలో వంద మందికి పైగా తెలంగాణ గురుకుల విద్యార్థులు చక్కగా పాఠాలను బోధిస్తున్నారు.
ఇక్కడ విద్యలో ఒత్తిడికి స్థానం లేదు. ప్రమాణాల పెంపుదలతోపాటు విషయ పరిజ్ఞానం, అభ్యాసం, ప్రయోగ జ్ఞానం పెంచుతున్నారు. మెడిసిన్, ఐఐటీ, ఇంజినీరింగు తదితర కోర్సులపై ఆసక్తి చూపే వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించారు. పదోతరగతి, ఇంటర్లలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఎంబీబీఎస్, ఇంజినీరింగులోనూ రాణిస్తున్నారు. బెంగళూరులోని అజీం ప్రేమ్జీ విశ్యవిద్యాలయానికి 22 మంది విద్యార్థులు ఎంపికై రికార్డు సాధించారు. ప్రాథమిక స్థాయి నుంచే సివిల్స్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మన టీవీలో వంద మందికి పైగా తెలంగాణ గురుకుల విద్యార్థులు చక్కగా పాఠాలను బోధిస్తున్నారు.

వసతిగృహాలు, గురుకులాల్లో అవినీతి తాండవిస్తూ ఉండేది. దానికి అడ్డుకట్ట పడింది. బియ్యం, కూరగాయలు, నిధులు, నిర్వహణ అంతా చక్కటిదారిలో పడింది. విధి నిర్వహణ, హాజరీ విధానాలు నూటికి నూరుశాతం అమలవుతున్నాయి.
ఎందరికో మార్గనిర్దేశనం
ఒకరు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్లు, మరో ఐదుగురు కేంద్ర సర్వీసు అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, విద్యావేత్తలు....ఐదువేల మందికి పైనే.... ఇంకా వేల మంది ఉన్నత విద్యావంతులు... వీరంతా దళిత కాలనీల్లోని పూరి గుడిసెలలో ఉద్భవించిన విద్యాకుసుమాలు. ఆణిముత్యాల్లాంటి వారందరినీ గురుకుల సంస్థ సమీకరించింది. వారంతా గురుకులాలకు వచ్చి వారు ఎదిగిన క్రమాన్ని వివరించి విద్యార్థులలో స్ఫూర్తి నింపుతున్నారు. ‘స్వారోస్’ పేరిట విద్యార్థులు గురుకుల పత్రికను నిర్వహిస్తున్నారు.
ఒకరు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్లు, మరో ఐదుగురు కేంద్ర సర్వీసు అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, విద్యావేత్తలు....ఐదువేల మందికి పైనే.... ఇంకా వేల మంది ఉన్నత విద్యావంతులు... వీరంతా దళిత కాలనీల్లోని పూరి గుడిసెలలో ఉద్భవించిన విద్యాకుసుమాలు. ఆణిముత్యాల్లాంటి వారందరినీ గురుకుల సంస్థ సమీకరించింది. వారంతా గురుకులాలకు వచ్చి వారు ఎదిగిన క్రమాన్ని వివరించి విద్యార్థులలో స్ఫూర్తి నింపుతున్నారు. ‘స్వారోస్’ పేరిట విద్యార్థులు గురుకుల పత్రికను నిర్వహిస్తున్నారు.



ఆర్ఎస్ ప్రవీణ్కుమార్,
తెలంగాణ దళిత, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి
తెలంగాణ దళిత, గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి

- రామ్లక్ష్మణ్, అధ్యాపకుడు

- ప్రశాంత్, గురుకుల విద్యార్థి
